కోదాడ డిపో మేనేజర్ సస్పెండ్: ఎందుకంటే...? మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే కొరఢా ఝులిపిస్తున్నారు. బుధవారం ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు. బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. బస్సుల వివరాలు, ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాలను రీజనల్ మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు.
57% కేసులు మహారాష్ట్ర నుంచే, 6 రోజుల్లో 237 మందికి వైరస్, కర్ణాటకలో కరోనా వైరస్ కలవరం..
ప్రతీ డిపోలో కండక్టర్కు తప్పకుండా శానిటైజర్ ఇవ్వాలని స్పష్టంచేశారు. ప్రయాణికులను హ్యాండ్ శానిటైజ్ చేసిన తర్వాతే టికెట్ అందజేయాలని కోరారు. మాస్క్ లేదంటే టికెట్ ఇవ్వొద్దని స్పష్టంచేశారు. అక్కడే కోదాడ డిపో బస్సులో ఎక్కారు శానిటైజర్ ఏది అని కండక్టర్ను అడిగారు. తనకు డిపో మేనేజర్ ఇవ్వలేదని చెప్పడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు. వెంటనే సూర్యాపేట ఆర్ఎంతో ఫోన్లో మాట్లాడారు. కండక్టర్కు శానిటైజర్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. కోదాడ డిపో మేనేజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆయా బస్సుల్లో కండక్టర్, డ్రైవర్ విధిగా నిబంధనలు పాటించాలని స్పష్టంచేశారు. రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. తర్వాత కొందరు ప్రయాణికులకు మంత్రి శానిటైజర్ చేశారు. అయితే మంగళవారం కొన్ని బస్సులల్లో ప్యాసెంజర్స్ నిబంధనలు పాటించలేదు. మార్క్ చేసిన సీట్లలో కూడా కూర్చొని కనిపించారు. మరో సీటులో తన పైనే కూర్చొపెట్టుకున్న ఫోటో కనిపించింది. కండక్టర్ పక్కనే ఉన్న.. చోద్యం చూస్తూ ఉండిపోయారు.