ధర్మపురిలో కోడి రామకృష్ణ, ఆర్పీ, శివారెడ్డి స్నానాలు: స్టేషన్లు కిటకిట(పిక్చర్స్)
హైదరాబాద్/కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పుష్కరాల జోరు కొనసాగుతోంది. గురువారం జిల్లాలో వీపీఐల తాకిడి ఎక్కువగా కనిపించింది. మూడో రోజు మొత్తం 22 ఘాట్లలో 3.55 లక్షల మంది పుణ్యస్నానాలు అచరించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. మల్లాపూర్ మండలం వేంపల్లి-వెంకట్రావుపేట పుష్కరఘాట్ను ఎంపీ కవిత పరిశీలించారు.
కాళేశ్వరంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా పుణ్యస్నానాలు అచరించారు. ధర్మపురిలో ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, సినీ డైరెక్టర్ కోడి రామకృష్ణ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, యాంకర్ ఝాన్సీ పుష్కరస్నానం చేశారు.
కోడి రామకృష్ణ
కరీంనగర్ జిల్లాలో పుష్కరాల జోరు కొనసాగుతోంది. గురువారం జిల్లాలో వీపీఐల తాకిడి ఎక్కువగా కనిపించింది.
శివారెడ్డి
ధర్మపురి పుష్కర ఘాట్లో సినీ నటుడు శివారెడ్డి దంపతులు గురువారం స్నానమాచరించారు.
కోడి రామకృష్ణ
గురువారం సినీ డైరెక్టర్ కోడి రామకృష్ణ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, యాంకర్ ఝాన్సీ పుష్కరస్నానం చేశారు.
పుష్కర సందడి
ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గోదావరి పుష్కర స్నానాలు ఆచరించేందుకు హైదారబాద్ నుంచి ప్రజలు భారీగా తరలి వెళ్తున్నారు.
పుష్కర సందడి
జులై 14 నుంచి ప్రారంభమైన పుష్కరాలకు ఇప్పటికే రికార్డు స్థాయిలో నగరవాసులు తరలివెళ్లినా, నగరంలోని బస్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిట లాడుతూ కన్పిస్తున్నాయి.
పుష్కర సందడి
ఈ క్రమంలో ప్రవేటు వాహనాలకు కూడా గిరాకీ బాగా పెరిగింది.
పుష్కర సందడి
రాజమండ్రి పుష్కర్ఘాట్లో అపశృతి చోటు చేసుకోవటంతో భక్తుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.
పుష్కర సందడి
ఈ క్రమంలో తెలంగాణలోని పుష్కరఘాట్లకు మరింత రద్దీ పెరిగే అవకాశాలున్నాయి.
రైల్వే, బస్ స్టేషన్లు కిటకిట
ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గోదావరి పుష్కర స్నానాలు ఆచరించేందుకు హైదారబాద్ నుంచి ప్రజలు భారీగా తరలి వెళ్తున్నారు. జులై 14 నుంచి ప్రారంభమైన పుష్కరాలకు ఇప్పటికే రికార్డు స్థాయిలో నగరవాసులు తరలివెళ్లినా, నగరంలోని బస్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిట లాడుతూ కన్పిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రవేటు వాహనాలకు కూడా గిరాకీ బాగా పెరిగింది. రాజమండ్రి పుష్కర్ఘాట్లో అపశృతి చోటు చేసుకోవటంతో భక్తుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణలోని పుష్కరఘాట్లకు మరింత రద్దీ పెరిగే అవకాశాలున్నాయి.
ధర్మపురిలో కోడి రామకృష్ణ, ఆర్పీ, శివారెడ్డి స్నానాలు: స్టేషన్లు కిటకిట