కాంగ్రెస్ లో మరో వికెట్ అవుట్, టిఆర్ఎస్ 100+1
కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ గూటికి చేరారు..ఇక ఎమ్మెల్యేలే కాకుండా జిల్లాల్లో ఉన్న నాయకత్వం సైతం పార్టీలు మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా నుండి వలసలు ప్రారంభమైయ్యాయి. మంగళవారం సాయంత్రమే గద్వాల్ మాజి ఎమ్మెల్యే పార్టీ సినియర్ నేత డి.కే అరుణ జిజేపి కండువా కప్పుకుంది..ఆమే బిజేపిలో చేరిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ కోల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి పార్టీని వీడి గులాబి దళంలోకి చేరనున్నారు..
కాంగ్రెస్ వద్దు కమలమే ముద్దు: బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి డీకే అరుణ..?
ఈ నేపథ్యంలోనే ఆయన ఉదయం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో సమావేశమయ్యారు. అనంతరం త్వరలో టిఆర్ఎస్ లో చేరనున్నట్టు ప్రకటించారు..అవసరమైతే పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజినామ చేస్తానని తెలిపారు..కోల్లాపూర్ నియోజకవర్గం అభివృద్దికి కేటిఆర్ హమీ ఇచ్చారని అందుకే పార్టీలో చేరుతున్నట్టు ఆయన చెప్పారు.
కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేల చేరికతో టిఆర్ఎస్ బలం వందకు చేరుకుంది.అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రతి పక్ష హోదా లేకుండా చేసేందుకు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ అధినాయకత్వం ..దీంతో మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం టిఆర్ఎస్ గూటికి చేరుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది.