కేసీఆర్తో కోమటిరెడ్డి భేటీ.. నియోజకవర్గ సమస్యలపై చర్చించారట..?
హైదరాబాద్ : తెలంగాణలో వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి .. బీజేపీలోకి నేతలు చేరుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం కావడం చర్చానీయాంశమైంది. అయితే తాను నియోజకవర్గ సమస్యలపై చర్చించానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మరో మూడురోజుల్లో మరోసారి భేటీ అవుతానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం కేసీఆర్పై ఒంటికాలిపై లేచే .. కోమటిరెడ్డి భేటీ కావడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
రాష్ట్రంలో చేరికల పర్వం కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్తో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ ప్రగతి భవన్లో కేసీఆర్తో వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు, మూడురోజుల్లో మళ్లీ సమావేశమవుతానని స్పష్టంచేశారు. దీంతో ఏం చర్చించారో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాను కేసీఆర్తో నియోజకవర్గ సమస్యలపై చర్చించినట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గ సాగునీరు, తాగునీరు సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. తన నియోజకర్గ సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్తో భేటీ అయినట్టు పేర్కొన్నారు. మరో మూడురోజుల్లో సమావేశమవుతానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.