కోమటిరెడ్డి-సంపత్ల కేసు: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్లు శాసన సభ్యత్వాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్ల కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.
కోమటిరెడ్డి-సంపత్ల కేసు: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్, వారందరికీ నోటీసులు
ఎమ్మెల్యేలుగా గుర్తించాలన్న సింగిల్ బెంచ్ తీర్పుపై రెండు నెలలు స్టే విధించింది. హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు ఇచ్చిన సింగిల్ బెంచ్. వారి శాసన సభ్యత్వం విషయంలో సాంకేతికంగానే 61 రోజులు ఆలస్యం జరిగిందని డివిజన్ బెంచ్కు ప్రభుత్వం తెలిపింది.
వారం రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్ల అనర్హత పిటిషన్ కేసులో హైకోర్టు మంగళవారం పలువురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ సహా సెక్రటరీ, లా సెక్రటరీలకు ఫాం 1 నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 17వ తేదీన నేరుగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ స్పీకర్కు కూడా హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్మెన్లను కేటాయించని కారణంగా డీజీపీ, గద్వాల, నల్గొండ ఎస్పీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఎవరు ధిక్కరించినా శిక్షార్హులేనని హైకోర్టు పేర్కొంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలను, అలాగే అసెంబ్లీ రిజిస్టర్ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లగా, ఇప్పుడు స్టే విధించింది. ఇది రెండు నెలల పాటు అమలవుతుందని తెలిపింది.