వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమటి రెడ్డి సంచలనం .. వైఎస్సార్ ఒకడుగు వేస్తే జగన్ రెండు అడుగులేస్తారు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏపీలో కాబోయే సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఏపీలో జగన్ అనూహ్య విజయం సాధించటంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో తాను ఎంపీగా గెలవడం, అటు ఏపీలో జగన్ సీఎం కానుండడం ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు.

జగన్ గత పదేళ్లుగా చాలా కష్టపడ్డాడని ఈ విజయం జగన్ పదేళ్ళ కృషి ఫలితం అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా జగన్ తండ్రి వైఎస్సార్ ను కూడా ప్రస్తావించారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి . దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్న ఆయన వైఎస్సార్ ఎప్పుడూ ప్రజల విషయంలోముందుండేవారని, జగన్ ఆయన్ను మించిపోతారని వ్యాఖ్యానించారు.

komatireddy sensation on Jagans victory

వైఎస్సార్ ఒక్కడుగు వేస్తే జగన్ రెండడుగులు వేస్తారని కితాబిచ్చారు. జగన్ ఈస్థాయికి చేరడం వెనుక పదేళ్ల శ్రమ ఉందని, ఎంతో కష్టించి ప్రజాదరణ పొందారని జగన్ ను కోమటి రెడ్డి ప్రశంసించారు . ఇక తాను సైతం నీతిగా పని చేసాను కాబట్టే ప్రజలు తనకు పట్టం కట్టారని ఆయన చెప్పుకొచ్చారు.

English summary
Jagan has been struggling over the past 10 years and this is the result of ten years of Jagan's victory Telangana congress leader komati reddy Venkatareddy said. On this occasion, Jagan's father YS Rajasekhar reddy also mentioned Komati Reddy Venkata Reddy. Recalling late leader YS Rajasekhar Reddy, he said YSR had always been in the public domain and said that Jagan will go beyond him said komati reddy Venkata reddy .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X