అబ్బే పార్టీ మారడం లేదు, గిట్టనివాళ్ళ ప్రచారం: కొండా సురేఖ
తాము టిఆర్ఎస్ ను వీడుతున్నట్టు వస్తున్న వార్తలను కొండా సురేఖ ఖండించారు. గిట్టనివాళ్ళు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
వరంగల్: తాము టిఆర్ఎస్ ను వీడుతున్నట్టు వస్తున్న వార్తలను కొండా సురేఖ ఖండించారు. గిట్టనివాళ్ళు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
తాము టిఆర్ఎస్ లోనే కొనసాగుతామన్నారు. తనకు రాజకీయాల్లోకి జన్మనిచ్చింది వైఎస్ఆర్ అని, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది కెసిఆర్ అని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
తాము టిఆర్ఎస్ ను వీడుతున్నట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇక తన రాజకీయ వారసురాలు కుమార్తె సుస్మితా పటేల్ అన్నారు. అయితే 2019 ఎన్నికల్లో తమ కుమార్తె పోటీ చేసే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో గిట్టనివారు ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ చెప్పారు.
Comments
English summary
Former minister Konda Surekha condemned rumours to join in Congress party on Saturday.some people spreading rumours on our family she said.
Story first published: Saturday, June 17, 2017, 17:44 [IST]