టీఆర్ఎస్కు షాకిస్తారా?: సొంత గూటికి కొండా సురేఖ!, ప్రెస్మీట్పై ఉత్కంఠ
Recommended Video
హైదరాబాద్: వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు టీఆర్ఎస్ మొదటి జాబితాలో అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కొండా దంపతులు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అంతేగాక, వారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెండు టికెట్లు అడుగుతున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైందన్న చర్చ నడుస్తోంది.
ముందస్తు ఎన్నికలు: కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే
కొండా దంపతుల కుమార్తె సుస్మితా పటేల్తో పాటు సురేఖకు టికెట్ కావాలని కేసీఆర్ను వారు అడిగినట్లు తెలిసింది. అయితే, సురేఖ లేదా సుస్మితా పటేల్ ఎవరో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారట. ఈ నేపథ్యంలోనే మొదటి జాబితాలో సురేఖకు అవకాశం దక్కలేదనే వాదనలున్నాయి.
ఈ క్రమంలో కొండా సురేఖ శనివారం ప్రెస్ మీట్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మీడియా సమావేశంలో కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా? లేక సొంత పార్టీ అయిన కాంగ్రెస్లోకి చేరతానంటూ ప్రకటన చేస్తారా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.