వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణుడికి తాపీ ధర్మారావు అవార్డు: 19న ప్రదానం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ జర్నలిస్టు, రచయిత, కవి ఎ.కృష్ణారావు 2015 సంవత్సరానికి తాపీ ధర్మారావు పురస్కారానికి ఎంపికయ్యారు. ఈనెల 19వ తేదీన తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో జరిగే కార్యక్రమంలో పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని తాపీ ధర్మారావు వేదిక తెలిపింది.

‘నేటి మీడియా విస్మృత వర్గాలు' అనే అంశంపై కృష్ణారావు ప్రసంగిస్తారని తెలిపింది. కృష్ణారావు ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా పని చేశారు. ఇటీవలే హైదరాబాద్‌ కేంద్రంగా ఆయన న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రెసిడెంట్‌ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు.

Krishna Rao gets Tapi Dharma Rao award

ఇంతకు ముందు ఈ అవార్డును డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, డాక్టర్ కె. శ్రీనివాస్, టంకశాల అశోక్, జి. శ్రీరామమూర్తి అందుకున్నారు. ఈ ఏడాది కృష్ణారావు ఈ పురస్కారాన్ని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పూర్వ సభ్యులు ఆచార్య కెఎస్ చలం అందుకుంటారు.

కృష్ణారావు కృష్ణుడిగా ప్రసిద్ధుడు. ఆయన కృష్ణుడి పేరు మీద కవిత్వం రాస్తూ వస్తున్నారు. ఇటీవల కూడా ఆయన కవితా సంకలనం ఒకటి విడుదలైంది.

నేపథ్యం: స్వభావం కవిత్వం నేపథ్యం: స్వభావం కవిత్వం

English summary
An eminent journalist and poet A Krishna Rao known as Krishnudu got Tapi Dharma Rao award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X