ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు, ‘0.09తో టాప్ ప్లేస్ మిస్’
Recommended Video
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. 0.09 శాతం తేడాతో ఈవోడీబీలో తెలంగాణకు తొలి ర్యాంకు దూరమైందన్నారు.
అధికారులు కనబరిచిన మంచి పనితీరు వల్ల ఈ ఏడాదీ మంచి ర్యాంకు సాధించామని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈవోడీబీ ర్యాంకులను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈజ్ ఆఫ్ డూయింగ్: ఏపీ టాప్, రెండో స్థానంలో తెలంగాణ, టాప్-5రాష్ట్రాలివే
We missed the 1st spot in EODB rankings 2018 by a whisker; 0.09%
— KTR (@KTRTRS) July 10, 2018
Nevertheless, inspirational leadership from @TelanganaCMO Garu & good work by our bureaucracy has resulted in a good rank this year too👏
Congratulations to Andhra Pradesh led by @ncbn Garu on topping the list 👍 pic.twitter.com/LnrBrj1tMV
ఈ ర్యాంకుల జాబితాలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానం, తదుపరి స్థానాల్లో హర్యానా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచిన విషయం తెలిసిందే.