పరిశ్రమలలో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు కల్పిoచాలి : కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఎగరవేశారు. ఈసంధర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు రావడంతో పాటు కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు అందలనేది సీఎం కేసీఆర్ విధానమని ఈసంధర్భంగా మాట్లాడుతూ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలోని అంగన్ వాడి కార్మికులకు రెండు సార్లు వేతనాలు పెంచడంతోపాటు సింగరేణి కార్మికులకు అత్యధిక బోనస్ ఇవ్వడంతో పాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించిన సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. హోం గార్డులు ,జీహెచ్ఎంసీ స్వపర్లు, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచిన కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కార్మికులందరికి రేషన్ కార్డులు ఇప్పించేందకు సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని తెలపారు.కార్మికులు పని చేసే చోట సదుపాయం కల్పించాలని ఆలోచన అని చెప్పారు.