దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్.. టార్గెట్ ఏంటో వివరించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ ప్రణాళికపై ఫోకస్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి వ్యుహరచన చేశారు. దీనికి సంబంధించి ఇవాల అధికారులతో ఏం చేయాలనే అంశం చర్చించారు. వచ్చే నెలలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధి కోసం అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ .. తమ శాఖపై ఫోకస్ చేశారు. కేసీఆర్ తొలి దఫా క్యాబినెట్లో కూడా కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖలను చూశారు. ఇవాళ అధికారులతో పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చించారు. వచ్చే నాలుగేళ్లకు అవసరమైన కార్యాచరణను విభాగాలవారీగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని గుర్తుచేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్లో పెట్టుబడులు పెడతారని పేర్కొన్నారు. వచ్చే నెలలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధి కోసం అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.