కేటీఆర్ ..ప్రపంచాన్ని జయించిన నాతో పెట్టుకోకు .. శపిస్తే మసైపోతావన్న కేఏపాల్
Recommended Video
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కోపం వచ్చింది. ఎవరి మీదో తెలుసా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద... అసలు ఎందుకు కే ఏ పాల్ కు కోపం వచ్చిందో తెలుసా ... ఆయనకు కోపం వచ్చిన కారణం సరైనదే కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు తెలంగాణలో చర్చకు దారి తీస్తున్నాయి. కేఏ పాల్ కు కోపమొస్తే అంతే అని ఇప్పుడు తెలంగాణా వాసులు గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..
కేటీఆర్ పై ఫైర్ అయిన కేఏ పాల్ .. విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపణ
మొన్నటికి మొన్న ఏపీలో నాయకులంతా నా ముందు బచ్చాలే అని విలువ తీసి పారేసిన కేఏ పాల్ తనకు ఆగ్రహం వస్తే శపిస్తానని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న విద్యార్థులఆత్మహత్యలపై ఆయన స్పందించారు. తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేఏ పాల్ మండిపడ్డారు.
ప్రపంచాన్ని జయించిన తనతో పెట్టుకోవద్దని కేటీఆర్ కు పాల్ వార్నింగ్
కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోగలరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను స్వాములు కూడా కాపాడలేరని... తాను శాపం పెడితే నాశనం అయిపోతారని చెప్పారు. సిగ్గులేని ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన అన్నారు. కేటీఆర్ కు డబ్బు, అహంకారం బాగా ఎక్కువైందని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు . కేటీఆర్ కు డబ్బు బాగా ఉంటే కాంగ్రెస్ నేతలు, కోదండరామ్ తో పెట్టుకోవాలని తనజోలికి రావద్దని చెప్పారు. ప్రపంచాన్ని జయించిన తనతో పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. సర్దుకు పోవడానికి తాను ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కాదని చెప్పారు. 2008లో కేసీఆర్ తన వద్దకు వస్తే ఆశీర్వదించానని చెప్పిన కేఏ పాల్ తాను మొదట్లోనే తెలంగాణకుమద్దతిచ్చానని చెప్పారు. అప్పట్లో కేసీఆర్ కు ఫండ్ కూడా ఇచ్చానని పాల్ గుర్తు చేశారు.
కేటీఆర్ కు పిచ్చి పట్టిందా ... తాను శపిస్తే మసైపోతారన్న పాల్
కేసీఆర్ కు, కేటీఆర్ కు కే ఏ పాల్ తెలంగాణాకు వస్తాడని నిద్ర పట్టటం లేదని ఆయన వ్యాఖ్య చేశారు . అంతే కాదు కేటీఆర్ తన ముందు కుర్రోడని, మతి లేక మాట్లాడుతున్నాడని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు . తాను కాంగ్రెస్ పార్టీని కాదు కొనటానికని ఎద్దేవా చేశారు. ప్రపంచాన్ని షేక్ చేసి ఓడించి గెలిచొచ్చానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా ఏమన్నా నువ్వు కట్టావా ? కేసీఆర్ కట్టాడా అంటూ మండిపడిన కేఏ పాల్ కేటీఆర్ కు ఏమైనా పిచ్చి పట్టిందా అంటూ విరుచుకుపడ్డారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు .. మోడీ, రాహుల్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేనా ?