మాదాపూర్లో తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: నగరంలో మంగళవారం తొలి ఏసీ బస్ షెల్టర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మంగళవారం ఉదయం అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్ను ఆయన కేటీఆర్ ప్రారంభించారు. శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్ను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ అరుదైన ఘనత సాధించింది.
The modern AC Bus Shelter inaugurated by Minister @KTRTRS today opposite Shilparamam has an exclusive “baby feeding room” for mothers of infants who may have to feed their kids on the go. This facility is open for all the moms who pass by the area. pic.twitter.com/ktDqQruY6I
— Min IT, Telangana (@MinIT_Telangana) May 22, 2018
శిల్పారామం దగ్గర లగ్జరీ వాష్రూం, లూ కేఫ్ను కూడా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.