వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు, చెన్నై కంటే బెస్ట్, ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్, ఐటీ కారిడార్‌లో మోనో రైలు!: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో మోనో రైల్ తీసుకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం చెప్పారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఆయన సీబీఆర్ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజా రవాణాకు మెట్రో రైలు వంటి ఆధునిక సదుపాయాలను తెస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ పూర్తవుతుందని వెల్లడించారు. దీంతో పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

'కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారంటేనే గుబులు, మూడో కన్ను తెరిస్తే''కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారంటేనే గుబులు, మూడో కన్ను తెరిస్తే'

ఉప్పల్, ఆదిభట్ల వైపు చూడండి

ఉప్పల్, ఆదిభట్ల వైపు చూడండి

హైదరాబాద్ తూర్పు వైపు అభివృద్ధికి ఆస్కారం ఉందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఉప్పల్, ఆదిభట్ల వైపు దృష్టి సారించాలని కేటీఆర్ కోరారు. హైదరాబాదులో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్ ఉందని చెప్పారు. ఆఫీస్ స్పేస్ అబ్జార్షన్‌లో నగరంలో మంచి అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు.

ఢిల్లీ, బెంగళూరు, చెన్నై కంటే బెస్ట్

ఢిల్లీ, బెంగళూరు, చెన్నై కంటే బెస్ట్

ఆఫీస్ స్పేస్ విషయంలో 2015తో పోల్చితే 2017లో డిమాండ్ రెట్టింపుగా ఉందని కేటీఆర్ చెప్పారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల కంటే హైదరాబాద్ సురక్షితమైన నగరమని చెప్పారు. భౌగోళికపరంగా కూడా హైదరాబాద్ ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీ అన్నారు. 19వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

మెట్రో రైలుకు అనూహ్య స్పందన

మెట్రో రైలుకు అనూహ్య స్పందన

హైదరాబాద్ మెట్రో రైలుకు అనూహ్యమైన స్పందన వస్తోందని కేటీఆర్ చెప్పారు. మెట్రో రైలులో రోజుకు లక్ష మందికి పైగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాదిలోపు మెట్రోను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మెట్రో మొదటి దశతో పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు వచ్చాయన్నారు.

వేలాది మందికి ఉపాధి

నూతన పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడులు చాలా వచ్చాయని కేటీఆర్ చెప్పారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరికింది, దొరుకుతోందన్నారు. కాగా కేటీఆర్ ప్రారంభించిన సీబీఆర్ఈ కార్పోరేట్ కేంద్రం రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవల కేంద్రం.

English summary
Telangana IT Minister KT Rama Rao said on Monday that Telangana State government thinking about Monorail project in IT corridor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X