మత్తు మందు ఇచ్చి యువతిపై లేడీస్ హాస్టల్ యజమాని అత్యాచారయత్నం
హైదరాబాద్: నగంరలోని ఎస్ఆర్ నగర్ బీకేగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బస చేస్తోన్న ఓ యువతిపై లైంగిక దాడి యత్నం జరిగింది. లేడీస్ హాస్టల్ యజమాని నరేందర్ రెడ్డి యవతికి మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.
స్పృహరావడంతో యవతి అతడి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్న యువతి ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లేడీస్ హాస్టల్ నిర్వహిస్తోన్న నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా యువతి నగరంలోని విల్లామేరి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది.
హైదరాబాద్లో 24గంటల్లో ఆరు చోట్ల చైన్ స్నాచింగ్లు
నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా నగరంలో 24 గంటల్లో ఆరు చోట్ల చైన్ స్నాచింగ్లు జరిగాయి. కర్మాన్ ఘాట్, బోయిగూడ, తుకారం గేట్, గోపాలపురంలో ఒంటరిగా వెళుతోన్న మహిళల మెడలోంచి చైన్లను లాక్కెళ్లారు.
బుధవారం జరిగిన చైన్స్నాచింగ్ ఘటన మరవకముందే గురువారం ఉదయం తుకారాం పోలీస్స్టేషన్ పరిధిలో మరో చైన్స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. అడ్డగుట్టలోని కిరాణా షాపులో సరుకులు ఇస్తున్న లక్ష్మి అనే మహిళ మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు తెంచుకుని వెళ్లారు. బాధితురాలు తుకారాం గేట్ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు మహిళ మెడలో ఉన్నది నకిలీ బంగారం గొలుసు అని లక్ష్మి పోలీసులకు వెల్లడించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స్నాచర్ల ఊహా చిత్రాలను విడుదల చేశారు. చైన్ స్నాచర్ల కోసం ప్రత్యేక గాలింపు బృందాలు రంగంలోకి దిగాయి.