వేధింపులు భరించలేకే న్యాయవాదిని సజీవ దహనం చేశా: లోకేష్
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం జరిగిన న్యాయవాది ఉదయ్ కుమార్ సజీవ దహనం కేసును పోలీసులు ఛేదించారు. న్యాయవాది హత్యకు భూ వివాదమే కారణమని తేల్చారు. న్యాయవాదిని హత్య చేసిన గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన లోకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కీసరలోని 5 ఎకరాల భూమిని ఉదయ్ కుమార్ గతంలో లోకేష్కు విక్రయించారు. ఆ తర్వాత ఆ భూమి తమకు కావాలని, డబ్బు తిరిగి చెల్లిస్తామని లోకేస్కు పలుమార్లు చెప్పారు. అతడు అంగీకరించకపోవడంతో ఉదయ్ కుమార్ అతనిపై తీవ్రంగా ఒత్తిడి చేశారు.
ఈ నేపథ్యంలోనే ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఉదయ్ కుమార్ను కర్రతో కొట్టి ఆ తర్వాత కారులో బంధించి సజీవ దహనం చేసినట్లు లోకేష్ పోలీసులు ముందు అంగీకరిచాడు. లోకేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. లోకేష్కు సహకరించిన అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
దారుణం: కారుతో సహా న్యాయవాదిని సజీవదహనం చేశారు
గత శనివారం అర్ధరాత్రి కీసర సమీపంలో తన కారులోనే ఉదయ్ కుమార్ సజీవ దహనమైన విషయం తెలిసిందే. వేగంగా స్పందించిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.