చంద్రబాబు అవినీతిపై పోరాడేందుకే జగన్ పార్టీలో చేరా: లక్ష్మీపార్వతి
తెలుగుదేశం పార్టీ అవినీతిపై పోరాటం చేసేందుకే తాను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎన్ టి ఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్ టి ఆర్ 21వ,వర్థంతిని పురస్కరించుకొని .
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అవినీతిపై పోరాటం చేసేందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఎన్ టి ఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్ టి ఆర్ వర్థంతిని పురస్కరించుకొని హైద్రాబాద్ లోని ఎన్ టి ఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులర్పించారు.
ఎన్ టి ఆర్ 21వ, వర్థంతిని పురస్కరించుకొని బుదవారం నాడు హైద్రాబాద్ లోని ఎన్ టి ఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఎన్ టి ఆర్ సూచించిన మార్గంలోనే తాను ప్రయాణం చేస్తున్నానని ఆమె చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అవినీతిపై పోరాటం చేసేందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె చెప్పారు. ఎన్ టి ఆర్ స్థాపించిన టిడిపికి, ప్రస్తుతం ఉన్న టిడిపికి తేడా ఉందన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ఎన్ టి ఆర్ తెచ్చారని ఆమె గుర్తుచేశారు.ఎన్ టి ఆర్ తనకు ఏ మార్గాన్ని చూపారో అదే మార్గంలో పయనిస్తున్నానని ఆమె చెప్పారు.