190 మందిని బతికుండగానే చంపి... రూ. 3కోట్లను నోక్కేసీ... ఎల్ఐసీ ఎజెంట్ల ఘాతుకం
ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 190 మందిని బతింకుండాగానే చంపివేశారు ఎల్ఐసీ ఎజెంట్లు. ఎల్ఐసీ చేసిన వినియోగదారులను మోసం చేసి వారు బతికుండగానే చనిపోయినట్టు నకీలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించారు కోదాడకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు.అనంతరం వారి చనిపోయినట్టు బీమా డబ్బుల కక్కుర్తి పడ్డారు. ఇలా 190 మంది కస్టమర్ల నుండి రూ. మూడు కోట్ల 14 లక్షల ఎల్ఐసీ సోమ్మును తమ ఖాతాల్లో వేసుకున్నారు.
దీంతో ఎజంట్ల తీరుపై అనుమానాలు చెలరేగడంతో కోదాడ ఎల్ఐసీ బ్రాంచీ మేనేజర్ వారిపై అంతర్గత విచారణ చేపట్టారు. దీంతో కోదాడ బ్రాంచ్లో ఉన్న బీకు నాయక్ అనే ఎజెంట్ ఈ అక్రమ దందాకు పాల్పడ్డట్లు తేలింది... కాగా వీరు 2006 నుండి 2014 వరకు ఈ దందా నిర్వహించారు. ఈనేపథ్యంలోనే సీబీఐ ఎంక్వాయిరీ చేయించాలని ఎల్ఐసీ నిర్ణయం తీసుకుంది. దీంతో సీబీఐ ఎంక్వయిరీ నిర్వహించడంతో అక్రమ దందా కొనసాగించిన వారి గుట్టు రట్టయింది. దీంతో ఈ దందాకు పాల్పడ్డ తొమ్మిది మందిపై పలు రకాల కేసులు నమోదు చేశారు.