Live: మున్పిపల్ ఫలితాలు.. ముఖ్యమంత్రి ముక్కు కోస్తానన్నారు.. కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి: కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దూసుకెళ్లోంది. మెజార్టీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పాగా వేసింది. విపక్ష కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కార్పొరేషన్లో ఖాతా తెరవని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అధికార పార్టీని గెలిపిస్తే పట్టణ/నగరాల అభివృద్ధి సాధ్యమని ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్పందించినట్టు కనిపిస్తోంది. అయితే నారాయణ ఖేడ్, యాదాద్రి మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలవడాన్ని మాత్రం గులాబీ దళం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ను బట్టి చూస్తే టీఆర్ఎస్ దారిదాపుల్లో ఏ పార్టీ కూడా నిలవని సిచుయేషన్ నెలకొంది.
ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తున్న కేటీఆర్
తెలంగాణ భవన్ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS.#TelanganaWithKCR pic.twitter.com/zCkakMmTRX
— TRS Party (@trspartyonline) January 25, 2020
అరుదైన ఫీట్.. కేసీఆర్ అశేషంగా విశ్వాసం
My heartfelt gratitude to the people of Telangana for reposing faith in Sri KCR Garu’s leadership again & giving us a thumping victory in Municipal elections 🙏 🙏🙏
— KTR (@KTRTRS) January 25, 2020
Winning more than 100 plus municipalities out of 120 and all 9 out of 9 municipal corporations is no mean feat 👍 pic.twitter.com/sKIA0D71GU
ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో తిరుగులేని ఫలితాలు
ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
— Harish Rao Thanneeru (@trsharish) January 25, 2020
టీఆర్ఎస్దే గెలుపు
ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.
— Harish Rao Thanneeru (@trsharish) January 25, 2020
రెబల్స్ బెడద టీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. కొల్లాపూర్, ఐజాలో ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి తన అనుచరులను మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఇదీ కాస్తా అధికార పార్టీని ఇబ్బందికి గురిచేస్తోంది. ఈ రెండు చోట్లు కూడా కలిస్తే టీఆర్ఎస్ పార్టీ మరింత శక్తిమంతంగా నిలిచేది.
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఓడిపోయిన కొడంగల్ మున్సిపాలిటీలో మాత్రం టీఆర్ఎస్ విజయం సాధించింది. మొన్నటి వరకు ఇక్కడినుంచే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కొడంగల్లో గులాబీ గుబాళింపుతో టీఆర్ఎస్లో మరింత జోష్ పెరిగింది.