లాక్ డౌన్ పొడిగింపు ... తెలంగాణా హైకోర్టు కీలక నిర్ణయం
కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని వదిలిపెట్టటం లేదు . ఇప్పటికి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 404 కేసులు నమోదు కాగా 11 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఇది వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించిన తరువాత కూడా ఇప్పటికీ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ విషయంలో తెలంగాణా హైకోర్టు పలు నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తుంది . ఇక ఈ తరుణంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్డౌన్ను కూడా ఏప్రిల్ 14 వరకు కొనసాగించాలని ప్రకటించిన హైకోర్టు తాజాగా మరోమారు లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది .
Recommended Video
లాక్ డౌన్ అమలుపై పలు ఏరియాల్లో హైదరాబాద్ సీపీ సడన్ విజిట్ .. ఏం చెప్పారంటే
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 14తో ముగుస్తుంది అని కొందరు భావిస్తుంటే మరికొందరు పెరుగుతున్న కేసుల దృష్ట్యా లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు కోర్టుల లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది హైకోర్టు. ఇప్పటికే అత్యవసర కేసులను విచారిస్తున్న హైకోర్టు న్యాయ వ్యవస్థలో పని చేసే వారి ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో కేసులు చాలా పెండింగ్ ఉంటాయి కాబట్టి ఇంకో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.
అదేమిటంటే తెలంగాణ కోర్టులకు ఈ ఏడాది వేసవి సెలవులను రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన న్యాయమూర్తులు, బార్ లీడర్లు, వైద్య నిపుణులతో ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన అనంతరం ఈ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోర్టులు ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 5 వరకు చేస్తాయి. ఇక హైకోర్టు నిర్ణయం మేరకు ఏప్రిల్ 30 వరకు న్యాయ శాఖ ఉద్యోగులు లాక్ డౌన్ పాటించాలని , ఇళ్లల్లోనే ఉండాలని కానీ అవసరం అయితే అందుబాటులో ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తుంది .