పెళ్లి... కొద్దిరోజులకే ఊహించని ట్విస్ట్... ఆ విషయం తెలిసి భర్త విడాకులు... చివరకిలా...
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి అదే జిల్లాకు చెందిన ఓ యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా పెద్దలు మాత్రం ససేమిరా అన్నారు. ఇంతలో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా మరో యువకుడితో వివాహం చేశారు. అయితే అప్పటికే ఆమె గర్భవతి అని తెలియడంతో భర్త విడాకులు ఇచ్చాడు. చివరకు పోలీసుల చొరవతో ప్రియుడితో ఆమె వివాహం జరిగింది.
రెండేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ...
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంకు చెందిన రజిత(పేరు మార్చాం),కుసుమంచి మండలం నర్సింహులు గూడెంకు చెందిన కళ్యాణ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని పెద్దలతో ప్రేమ విషయం చెప్పారు. అయితే ఇరువురి పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఇంతలో కుటుంబ సభ్యులు ఆమెకు వేరే యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారు.
గర్భవతి అని తెలియడంతో..
పెళ్లయిన కొద్ది రోజులకు రజిత అనారోగ్యం బారినపడింది. దీంతో స్ధానిక అస్పత్రిలో భర్త పావనికి వైద్య పరీక్షలు చేయించగా... అప్పటికే అమె గర్భవతి అని తెలిసింది. దీంతో భర్త రజితను నిలదీయగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత రజితకు అతను విడాకులు ఇచ్చాడు. దిక్కు తోచని స్థితిలో రజిత ఖమ్మం షీ టీమ్ సీఐ అంజలిని కలిసి జరిగిన విషయం చెప్పింది. తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
ఒక్కటైన రజిత-కల్యాణ్...
సీఐ అంజలి చొరవ తీసుకుని గతంలో పావని ప్రేమించిన యువకుడి తల్లిదండ్రులను,ఆమె తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించింది. అక్కడ ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. ఎట్టకేలకు ఇరు కుటుంబాలు వారికి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నాయి. షీ టీమ్ సభ్యుల సమక్షంలోనే రజిత-కల్యాణ్ల వివాహం జరిగింది. కొత్త జంటకు సీఐ అంజలి సహా అక్కడి పోలీసులు శుభాకాంక్షలు తెలియజేశారు.