వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూల్‌డ్రింక్‌లో యాసిడ్ కలిపిచ్చిన ప్రియుడు, మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని హైదరాబాద్ నగరంలోని నేరేడ్‌మెట్‌లో యాసిడ్‌ దాడికి గురైన ఓ యువతి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ నెల 13వ తేదీన ప్రియుడి చేతిలో యాసిడ్‌ దాడికి గురైన యువతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది.

నిందితుడు యువతిని మోసగించి గర్భవతిని చేసి, ఆపై యాసిడ్‌తో దాడి చేశాడు. యువతి మృతితో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి.

నిందితుడు కూల్ డ్రింక్‌లో యువతికి యాసిడ్ కలిపి తాగించాడు. బాధితురాలి పేరు రీనాగా తెలుస్తోంది. నిందితుడు నరేంద్రగా తెలుస్తోంది. రీనాకు గతంలోనే పెళ్లైంది. భర్తను విడిచిపెట్టింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అనంతరం నరేంద్రతో రెండేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇటీవల అతను కూల్ డ్రింక్‌లో యాసిడ్ కలిపి తాగించాడు. ఇప్పుడు ఆమె మృతి చెందింది. పోలీసులు అతనిని విచారిస్తామని చెప్పారు.

Lover kills girl in Hyderabad

పెళ్లికి నిరాకరించిందని యువకుడి ఘాతుకం

యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వేంసూరు మండలం దుద్దుపూడి గ్రామంలో పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. యువతి బంధువులు మృతదేహంతో యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. వారు పరారీలో ఉన్నారు.

నిప్పు అంటించిన ప్రేమోన్మాది

జూబ్లీహిల్స్‌లో ప్రియురాలిపై ఓ ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. తీవ్ర గాయాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది.

English summary
Lover kills girl in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X