ప్రేయసిని గర్భవతిని చేసి వదిలేసిన ప్రియుడు
హైదరాబాద్: ప్రేమ పేరుతో మోసం చేశాడు ఓ యువకుడు యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుందామంటే ఆమెపై అతను దాడి చేయించాడు, ప్రేమను నమ్మిన ఆ ప్రియురాలిని బజారుపాలు చేశాడు. మహబూబ్నగర్ జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లిలో ఇద్దరు యువతీయువకులు ప్రేమించుకుంటున్నారు. అయితే యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు.
ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రియురాలు ప్రియుడిని నిలదీసింది. దాంతో ప్రియుడు ముఖం చాటేశాడు. ఇక చేసేది ఏమి లేక ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని ప్రియురాలు డిమాండ్ చేసింది. ప్రియురాలి ధర్నాతో విసుగెత్తి పోయిన ప్రియుడి కుటుంబ సభ్యులు యువతి బంధువులపై దాడి చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోగిల గేటు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ కల్లు తాగడంతో అస్వస్థత
ఆదివాలాబ్ద లోకేశ్వరం మండలం పిప్పిరిలో కల్తీ కల్లు తాగడంతో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు భైంసా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్లు నమూనాలను ఎక్సైజ్ అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.