నమస్తే మోడీజీ, నమస్తే ఇవాంకా ట్రంప్: జీఈఎస్లో' మిత్ర' రోబోల పలకరింపు
జీఈఎస్ 2017 సమ్మిట్కు హజరయ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 'మిత్ర' స్వాగతం పలుకనుంది.
Recommended Video
హైదరాబాద్: జీఈఎస్ 2017 సమ్మిట్కు హజరయ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 'మిత్ర' స్వాగతం పలుకనుంది.పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రోబోకు 'మిత్ర అని పేరు పెట్టారు.
ఇండియా చరిత్ర, సంస్కృతి చాలా ఇష్టం, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇవాంకా ట్రంప్
ప్రపంచ పెట్టుడిదారుల సదస్సు 2017 ప్రపంచంలోని 120 దేశాల నుండి సుమారు 1600 మంది ప్రతినిధులు హజరుకానున్నారు.ఈ ప్రతినిధుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు.
ఇవాంకా టూర్: జీఈఎస్ సమ్మిట్లో 10 దేశాల నుండి మహిళలే, ప్రత్యేకతలివే
అయితే ఇవాంకా ట్రంప్, మోడీ లాంటి వివిఐపిలు, విఐపిలు ఈ సదస్సుకు హజరుకానున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలపైనే ఈ సదస్సు ఫోకస్ చేయనుంది.
ఇవాంకా టూర్: హైద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ ప్రాంతాల్లో వెళ్తే ఇబ్బందులే
ఇవాంకా టూర్: 1883లోనే టెలిఫోన్, విద్యుత్, ఫలక్నుమా ప్యాలెస్ ప్రత్యేకతలివే!
ఇవాంకా ట్రంప్, మోడీకి రోబో స్వాగతం
నమస్తే నరేంద్రమోదీజీ.. నమస్తే ఇవాంకా ట్రంప్' అంటూ ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు హాజరుకాబోతున్న ప్రధాని మోదీని, ఇవాంకలకు ‘మిత్ర' స్వాగతం పలుకబోతుంది. హెచ్ఐసీసీ ప్రాంగణానికి మోదీ, ఇవాంక చేరుకోగానే వారిని మిత్ర పలుకరిస్తుంది. బెంగళూరుకు చెందిన బాలాజీ విశ్వనాథన్ పూర్తి స్వదేశీ విజ్ఞానంతో ఈ రోబోను తయారు చేశారు.
జీఈఎస్ ప్రాంగంణంలో రెండు రోబోలు
హైదరాబాద్లో జరగనున్న జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడ రెండు ‘మేడిన్ ఇండియా' రోబోలను విశ్వనాథన్ బృందం ప్రదర్శనకు పెట్టింది.
ఈ రెండు బోట్లలో ఒకటి వేదిక మీద విదేశీ పారిశ్రామిక ప్రముఖులతో ముచ్చటిస్తుంది. మరొక రోబో వేదిక బయట ప్రేక్షకులతో ముచ్చటిస్తుంది.
పాట పాడనున్న రోబో
ప్రధాని మోదీ, ఇవాంక వేదిక మీదకు రాగానే మిత్ర వారి వద్దకు వెళ్లి.. వారితో సంభాషిస్తుంది. వాళ్లు ఒక బటన్ ప్రెస్ చేస్తారు. దీంతో మిత్ర పాట పాడుతుంది.శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైనట్టు డిక్లేర్ అవుతుందని విశ్వనాథన్ తెలిపారు.
1500 శిక్షణ ప్రక్రియలు
మా ‘మేడిన్ ఇండియా' రోబోట్లను ప్రదర్శించడానికి జీఈఎస్ను ఆదర్శ వేదికగా మేం భావిస్తున్నాం. ఈ సదస్సుకు అత్యంత ప్రముఖులు వస్తుండటం, కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో మిత్ర వేదిక మీద కొద్దిసేపు మాత్రమే ముచ్చటిస్తుందని విశ్వనాథన్ తెలిపారు.. ఇప్పటికే ఈ రోబోలకు 1000-1500 శిక్షణ ప్రక్రియలను నిర్వహించామన్నారు విశ్వనాథన్.
హైద్రాబాద్ నుండి ఇవాంకా ట్రంప్ ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ నుండి ట్వీట్ చేశారు. ఉదయం 10.22 గంటలకు ఆమె భాగ్యనగరం నుంచి తొలి ట్వీట్ చేశారు. "అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు. హైదరాబాదులో ఉండటం పట్ల ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నా" అంటూ ట్విట్టర్ ద్వారా ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ... ఇవాంకా ట్రంప్ ట్వీట్ కు ప్రతిస్పందించారు. 'వెల్ కమ్ టు ఇండియా' అంటూ ట్వీట్ చేశారు.