సోకులతో విదేశాలు తిరిగే కవిత, కేసీఆర్ మోడీ కాళ్లు పట్టుకోలేదా: యాష్కీ
తెరాస నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పైన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గురువారం తీవ్రంగా మండిపడ్డారు.
హైదరాబాద్: తెరాస నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పైన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గురువారం తీవ్రంగా మండిపడ్డారు. సోకులతో విదేశాలు తిరిగే కవితకు విద్యార్థుల శోకాలు కనబడటం లేదా అని మండిపడ్డారు.
చప్పట్లు కొట్టిందీ మీరే, చేయని తప్పుకు విడిపోయాం, భయపడాలి: బాబుకు పవన్
కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ ఆస్తులను కొల్లగొడుతోందన్నారు. ఈడీ నోటీసుల కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. నవంబర్ 18వ తేదీన మోడీ కాళ్లు కేసీఆర్ పట్టుకోలేదా అని ప్రశ్నించారు.
కోదండరాంపై కవిత ఆగ్రహం
అంతకుముందు రోజు, జేఏసీ చైర్మన్ కోదండరాం పైన కవిత ఆగ్రహించారు. ఈ మధ్య ఉద్యోగ విరమణ చేసిన వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని కోదండను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమస్య లేకుండానే సమస్య సృష్టించాలని చూస్తున్నారన్నారు. 3వేలు కాదు, 3 లక్షల కిలోమీటర్లు నడిచినా ఏం కాదన్నారు.