32 జెడ్పీలు, 530 ఎంపీటీసీలు మావే : స్థానిక సంస్థల్లో విజయంపై కేటీఆర్ ధీమా
హైదరాబాద్ : టీఆర్ఎస్ విజయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన .. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మెజార్టీ లోక్సభ సీట్లు గెలుస్తామని విశ్వాసంతో ఉంది. ఇక స్థానిక సంస్థల్లో కూడా గులాబీ జెండా ఎగురేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో పాగా వేస్తామని ధీమాతో ఉంది. ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు.
కలిసి
పనిచేయండి
స్థానిక
సంస్థల
అనుసరించాల్సిన
వ్యుహంతోపాటు
..
లోక్
సభ
పోలింగ్
సరళి
గురించి
కేటీఆర్
చర్చించారు.
ఎల్లుండి
జరిగే
టీఆర్ఎస్
విసృతస్థాయి
సమావేశం
గురించి
కూడా
సమావేశంలో
ప్రస్తావన
వచ్చింది.
రాష్ట్రంలోని
జెడ్పీల్లో
గెలువడమే
లక్ష్యంగా
పనిచేయాలని
జనరల్
సెక్రటరీలకు
కేటీఆర్
స్పష్టంచేశారు.
జెడ్పీటీసీ,
ఎంపీటీసీ
ఎన్నికల్లో
విజయం
సాధించేందుకు
కృషిచేయాలని
పేర్కొన్నారు.
32
జెడ్పీలతోపాటు
530
ఎంపీటీసీ
స్థానాలు
కూడా
గెలుస్తామని
ధీమాతో
ఉన్నారు
కేటీఆర్.
కాంగ్రెస్కు
అంత
లేదు
వివిధ
ఎన్నికల్లో
విపక్ష
కాంగ్రెస్
పార్టీని
ప్రజలు
తిరస్కరించారని
గుర్తుచేశారు
కేటీఆర్.
లోక్సభ
ఎన్నికల్లోనూ
ప్రజలు
టీఆర్ఎస్
పార్టీకి
బ్రహ్మారథం
పట్టారని
తెలిపారు.
స్థానిక
సంస్థల
ఎన్నికల్లో
ప్రజాప్రతినిధులు,
మాజీ
మంత్రులు,
సీనియర్
నేతలు
అందరి
కలుపుకొని
పనిచేయాలని
సూచించారు.
ఈ
ఎన్నికలకు
సంబంధించి
సీఎం
కేసీఆర్
..
సోమవారం
జరిగే
పార్టీ
విసృతస్థాయి
సమావేశంలో
దిశానిర్దేశం
చేస్తారని
పేర్కొన్నారు.