మనుషులేనా?: పుట్టిన శిశువు గొంతుకోసి రోడ్డుపై పడేశారు, కాపాడిన పోలీసు
వరంగల్: అప్పుడే జన్మించిన ఓ శిశువును గొంతుకోసి రోడ్డుపై పడేసిన అమానుష ఘటన సోమవారం రాత్రి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో చోటుచేసుకుంది. హన్మకొండలోని ప్రసూతి వైద్యశాల ముందు మగ శిశువు గుక్కపట్టి ఏడుస్తుండగా అప్పుడే అటునుంచి వెళ్తున్న హెడ్కానిస్టేబుల్ జనార్దన్ అక్కడికి వెళ్లాడు.
గొంతుపై తీవ్రగాయాలతో ఉన్న శిశువును చికిత్స కోసం స్థానిక మ్యాక్స్కేర్ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు కిషన్పురలోని అమృత పిల్లల దవాఖానకు తరలించారు.
పసికందు గాయాలకు చికిత్సచేశారు. సకాలంలో దవాఖానకు తీసుకొనిరావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
బావిలో దూకి తల్లీ ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలం వామన్నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. బావిలో దూకి తల్లీ ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాలే వారి ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెప్పారు.