'ప్రేమ' పేరుతో మాయ.. బాలికకు గర్భం: ప్రియుడు పరార్.. తల్లిదండ్రులకు షాక్!
రెండేళ్ల క్రితం ఈ కుటుంబానికి చెందిన బాలికతో రామకృష్ణ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది.
షాద్నగర్: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ కుటంబానికి చెందిన బాలికపై యువకుడి కన్ను పడింది. ఆమెతో పరిచయం పెంచుకుని.. 'ప్రేమ' అంటూ వెంటపడ్డాడు. బాలిక కూడా అతని మాయ మాటలను నమ్మడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది.
అది కాస్త శారీరక సంబంధానికి దారి తీసి.. బాలిక గర్భం దాల్చింది. విషయం ఆమె ఇంట్లో తెలియడంతో ప్రియుడు పరారయ్యాడు. షాద్నగర్లోని కేశంపేట రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నందిగామ మండలం ఈదులపల్లికి చెందిన ఓ కుటుంబం కేశంపేట రోడ్డులో నివాసముంటూ హమాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రెండేళ్ల క్రితం ఈ కుటుంబానికి చెందిన బాలికతో ఒక యువకుడికి పరిచయం ఏర్పడింది. స్థానికంగా కొబ్బరి బోండాలు విక్రయించే చౌలపల్లికి చెందిన రామకృష్ణతో ఏర్పడిన పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో బాలిక కొద్దిరోజుల నుంచి తరుచుగా అనారోగ్యానికి గురవుతూ వస్తుంది. వైద్య చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె 6నెలల గర్బవతి అని వైద్యులు చెప్పారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడిపై కేసు నమోదైంది. ప్రస్తుతం రామకృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.