కోడలితో వివాహేతర సంబంధం సాగించిన ఆ మామ మృతి
తన కోడలు (కొడుకు భార్య)తో వివాహేతర సంబంధం సాగించిన పాపాత్ముడైన మామ.. ఖమ్మంలోని ఆస్పత్రిలో శుక్రవారం చనిపోయాడు. ఇతడు, కోడలు కొన్నాళ్లపాటు వివాహేతర సంబందం సాగించారు.
ఖమ్మం: తన కోడలు (కొడుకు భార్య)తో వివాహేతర సంబంధం సాగించిన పాపాత్ముడైన మామ.. ఖమ్మంలోని ఆస్పత్రిలో శుక్రవారం చనిపోయాడు. ఇతడు, కోడలు కొన్నాళ్లపాటు వివాహేతర సంబందం సాగించారు.
ఇంట్లోవాళ్లు మందలించడంతో దాదాపు నెలన్నర రోజులు పారిపోయారు. ఆ తరువాత తిరిగొస్తూ.. ఖమ్మం శివారులో పురుగు మందు తాగారు. ఇద్దరూ తమ చేతుల మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఆస్పత్రిలో కోడలు చనిపోయింది. మామ కూడా శుక్రవారం చనిపోయాడు.
పోలీసులు ఏం చెప్పారంటే....
ఏన్కూరు మండలంలోని ఎర్రబోడుతండాకు చెందిన బానోత్ వీరన్న కిరాణా వ్యాపారి. తన కోడలు (కొడుకు భార్య) అనితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరిని కుటుంబ సభ్యులు మందలించారు. ఊళ్లో జనానికి తెలిసింది. వారు కూడా చీదరించుకున్నారు.
Recommended Video
ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఇంటి నుంచి ఎటో పారిపోయారు. వారం రోజుల కిందట (జూన్ 25వ తేదీన) ఖమ్మం శివారులోగల రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామ సెంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు తాగారు.
తమ చేతి మణికట్టు వద్ద కోసుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో వారిద్దరినీ పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 1వ తేదీన కోడలు అనిత చనిపోయింది. చికిత్స పొందుతున్న మామ వీరన్న కూడా శుక్రవారం మృతి చెందాడు.