నిశ్చితార్థం కోసం కోల్కతా నుంచి వచ్చాడు, షాపింగ్ తర్వాత అదృశ్యం
హైదరాబాద్: పెళ్లి షాపింగ్ కోసం వచ్చిన ఓ యువకుడు కనిపించక పోవడంతో అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన సంఘటన సికింద్రాబాదులో చోటు చేసుకుంది. జహీరాబాదుకు చెందిన భాను కిరణ్ అనే వ్యక్తి కోల్కతాలో ఉద్యోగం చేస్తున్నాడు.
అతనికి ఈ రోజు (గురువారం) నిశ్చితార్థం ఉంది. సికంద్రాబాదులో షాపింగ్కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. షాపింగ్ అనంతరం అందరు స్టేషన్ వద్దకు వచ్చారు. ఆ యువకుడు మాత్రం కనిపించలేదు. ఎంత గాలించినా అతని ఆచూకీ లభించలేదు.
అతని సెల్ ఫోన్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీంతో పోలీసులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతనికి చేర్యాలకు చెందిన యువతితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అతను కోల్కతా నుంచి నిశ్చితార్థం కోసమే వచ్చాడు. అయితే హఠాత్తుగా మాయం కావడంతో... అతను కావాలని వెళ్లిపోయాడా లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.