భర్య కిరాతకం: భార్యతో పురుగుల మందు తాగించాడు, ఆరుసార్లు అబార్షన్ చేయించాడు
భార్య పట్ల ఓ భర్త అతి కిరాతకంగా వ్యవహరించాడు. ఆమెతో పురుగుల మందు తాగించాడు. ఆరుసార్లు గర్భవిచ్ఛిత్తి చేయించాడు.
రీంనగర్: భార్యను వదిలించుకోవడానికి పురుగుల మందు తాగించిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలో జరిగింది. సైదాపూర్ మండలం దుద్దెనపల్లికి చెందిన చంద రమకు సుల్తానాబాద్ మండలం పూసాలకు చెందిన కోట రఘుపతిరెడ్డితో 2011లో వివాహం జరిగింది.
పెళ్లైన ఏడాది నుంచే రఘుపతిరెడ్డి మద్యం సేవించి భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. చిత్రహింసలకు ఆమెకు ఆరుసార్లు గర్భస్రావం అయ్యింది. గురువారం రాత్రి రఘుపతిరెడ్డి తాగి వచ్చి క్టొి బలవంతంగా భార్యకు పురుగుల మందు తాగించాడు. చుట్టుపక్కలవారు గమనించి అసుపత్రిలో చేర్పించారు.
రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రుఘుపతిరెడ్డి, బావలు శ్రీనివాసరెడ్డి, కుటుంబసభ్యులు రాంరెడ్డి, భారతి, స్వప్నలపై హత్యాయత్నం, వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దేవేందర్ తెలిపారు.
ప్రియుడి మరణం... ప్రియురాలి ఆత్మహత్య
ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాలను బలితీసుకుంది. పెళ్ళికి ప్రియురాలు ఆలస్యం చేస్తుందనే మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా అతని మరణం తట్టుకోలేక ప్రియురాలు కూడా ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరిఖనికి చెందిన మార్క ప్రవీణ్(25), బోడకుంట ప్రియాంక (22) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ప్రియాంక ఇంో్ల తెలియదు.
అక్క పెళ్లి తరువాత వివాహం చేసుకుందామని ప్రియాంక ప్రవీణ్కు నచ్చజెపుతోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ప్రవీణ్ ఇంో్ల పెళ్లి విషయం చర్చింకుకున్నారు. పెళ్ళికి ప్రియాంక అంగీకరించకపోవడంతో ప్రవీణ్ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు ప్రియాంకను వివచారించారు. ప్రవీణ్ మరణం తట్టుకోలేక ప్రియాంక శుక్రవారం ఇంో్ల ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.