అమ్మాయిల ఫోటోలు తీస్తూ పట్టుబడిన ఆకతాయి: దేహశుద్ధి
హైదరాబాద్: సెల్ఫోన్లో అమ్మాయిల ఫొటోలు తీస్తూ ఓ యువకుడు రెండ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతన్ని పట్టుకుని ప్రజలు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో జరిగింది. దేహశుద్ధి చేసిన తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు.
ఎంఎంటిఎస్ రైలు దిగి వస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తన ఫోన్తో ఫొటో తీశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆమె తన ఫొటో ఎందుకు తీశావంటూ అతనితో వాగ్వివాదానికి దిగింది. అయితే, అతను పొంతన లేని సమాధానాలిచ్చాడు.
ఈ విషయాన్ని గుర్తించిన సహ ప్రయాణికులు ఆ వ్యక్తిని నిలదీసినా ఫలితం లేకపోయింది. అతడి వద్ద ఉన్న సెల్ఫోన్ తీసుకుని చూశారు. అందులో చాలా మంది అమ్మాయిల ఫొటోలు ఉన్నాయి. రైల్వే స్టేషన్కు వచ్చే అందమైన యువతుల ఫొటోలను అతను తన సెల్లో బంధిస్తున్నాడని వారు గుర్తించారు. అతన్ని చితకబాదారు.
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతన్ని పోలీసు స్టేషన్కు తరలించి విచారిస్తు్నారు. అతను యువతుల ఫోటోలను ఎందుకు తీస్తున్నాడనే విషయాన్ని కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.