సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం... కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు...
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఫైరింజన్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recommended Video
శ్రీశైలం పవర్ప్లాంట్లో అగ్నిప్రమాద సంఘటన మరవకముందే సంగారెడ్డిలో అగ్నిప్రమాదం సంభవించడం గమనార్హం. శ్రీశైలం ప్రమాదంలో 9 మంది ఇంజనీర్లు ప్లాంట్ లోపలే చిక్కుకుపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం(అగస్టు 20) రాత్రి ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగడంతో విధుల్లో ఉన్న 17 మంది లోపలే చిక్కుకుపోయారు. వీరిలో 8 మంది ఎస్కేప్ టన్నెల్స్ ద్వారా బయటపడగా... మిగతావారు లోపలే చిక్కుకుపోయి మృతి చెందారు. ఎన్డీఆర్ఎఫ్,సింగరేణి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగినప్పటికీ.. లోపల కమ్ముకుపోయిన దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.