కుట్ర: నోటుకు ఓటు కేసులో నోటీస్పై హైకోర్టుకెక్కిన మత్తయ్య
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్య సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తనకు ఎసిబి అధికారులు నోటీసులు ఇచ్చారని ఆయన తన పిటిషన్లో చెప్పారు.
కేసు వివరాలు తెలియకుండా ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. తనకు న్యాయవాదిని నియమించాలని ఆయన హైకోర్టను కోరారు. నోటుకు ఓటు కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని తెలంగాణ ఎసిబి ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఏసీబీ అధికారులు తనకు నోటీసులు ఇవ్వడం తగదని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య ఇటీవ ఆయన అన్న వి,యం తెలిసిందే. హైకోర్టు స్టేను ధిక్కరించి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారన్నాడు. కేవలం పోలీసుల విధులకు ఆటంకం కలిగించవద్దనే నోటీసులు తీసుకున్నట్లు చెప్పాడు.
ఏసీబీ విచారణకు హాజరయ్యే ప్రసక్తే లేదని చెప్పాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని చెప్పాడు. అందులో భాగంగానే ఈ నోటీసులను పంపించారని ఆరోపించాడు. ఏపీలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరాడు.