మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్ వద్ద ధర్నా
సిద్దిపేట్ నియోజకవర్గం ఇబ్రహింపూర్ లో ఉద్రిక్తవాతరవరణం నెలకొంది. తెరాసా కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నారని ,దీంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జ్యన్యాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అరోపించింది.ఇదే విషయన్ని పోలీసులకు చెప్పినా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గ్రామంలోలోని పోలింగ్ బూత్ కు చేరుకున్నారు.అయినా పరిస్థితి మారకపోవడంతో ఆయన ఇబ్రహింపూర్ గ్రామం పోలింగ్ బూత్ వద్దే బైఠాయించారు.కాగా మెదక్ టీఆఆర్ఎస్ అభ్యర్థిగా కే ,ప్రభాకర్ రెడ్డి పోటిచేస్తున్న విషయం తెలిసిందే.
Comments
English summary
election tention in siddipet mandal, medak congress candidate G.Anilkumar protest dharna at polling booth for allegedly rigging by trs
Story first published: Thursday, April 11, 2019, 15:47 [IST]