ఘోర రోడ్డు ప్రమాదం: మహిళపైనుంచి దూసుకెళ్లిన లారీ(వీడియో)
రంగారెడ్డి: మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ప్రియ అనే మహిళ.. గురువారం ఉదయం రోజూలాగే తన స్కూటర్పై రహదారిపైకి వచ్చింది.
స్థానిక వివేకానంద విగ్రహం వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన లారీ ఆమెను ఢీకొట్టింది. ఆ తర్వాత లారీ చక్రాల కింద పడిపోయిన ప్రియా తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ ఫుటేజ్లో నమోదయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రమాద ఘటన కలచివేసేలా ఉంది. రోడ్డు దాటుతున్న ప్రియ.. వెనుకవైపు నుంచి వస్తున్న లారీని గమనించకపోవడంతో.. లారీ వేగంగా వస్తుండటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
A woman was killed in a #RoadAccident after her Activa was hit by a lorry and ran over her, while crossing the road without watching left side, at #Medchal near #Hyderabad on Thursday morning. She was works in a Security company. Follow #TrafficRules.#RoadSafety #BikeAccident pic.twitter.com/HleOfp0phB
— Surya Reddy (@jsuryareddy) September 29, 2022
రోడ్డుపైకి వస్తున్నప్పుడు వాహనాలను జాగ్రత్తగా నడపాలని, అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాలను కూడా గమనించాలని ప్రమాద వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె రోడ్డు క్రాస్ చేస్తున్నప్పడు వెనుకవైపు నుంచి వస్తున్న లారీని గమనించినట్లయితే.. ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదని అంటున్నారు.