సుబ్బరాజు ఇంటి వద్ద ఉద్రిక్తత: మీడియాను అడ్డుకుని.. సెక్యూరిటీ వాగ్వాదం..
కవరేజీ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిని సుబ్బరాజు ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ అడ్డుకున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో నేడు నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 10గం.కు సుబ్బరాజు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. అయితే సుబ్బరాజు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
కవరేజీ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిని సుబ్బరాజు ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీకి, మీడియాకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సుబ్బరాజు తన వాహనంలో ఎక్సైజ్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడటానికి ఆయన విముఖత వ్యక్తం చేశారు.
సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కాగా, విచారణలో కెల్విన్ తో సంబంధాలు, అతనితో చాటింగ్ వంటి విషయాల పైనే సిట్ కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇదే కేసుకు సంబంధించి గురువారం శ్యాంకె నాయుడు, బుధవారం పూరి జగన్నాథ్ సైతం విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పూరిని అగస్టు నెలలో మరోసారి విచారించే అవకాశం ఉంది.