అమీర్పేట్-ఎల్బీనగర్ మెట్రో లైన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
హైదరాబాద్: నగరంలో రెండో దశ మెట్రో రైలు మార్గం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12.15గంటలకు ఎల్పీనగర్-అమీర్పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నర్సింహన్ హాజరై ప్రారంభించనున్నారు. సీఎస్ ఎస్కే జోషీ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులతో కలిసి బుధవారం సాయంత్రం రాజ్భవన్కు వెళ్లిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ను ఆహ్వానించారు.
కాగా, ఇప్పటికే నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో రైలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్బీనగర్-అమీర్పేట మార్గం కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండనుంది.
Comments
hyderabad metro metro rail lb nagar ameerpet ktr esl narasimhan Governor హైదరాబాద్ మెట్రో మెట్రో రైలు ఎల్బీనగర్ ఈఎస్ఎల్ నర్సింహన్ గవర్నర్
English summary
The much awaited Ameerpet to LB Nagar line of Hyderabad Metro Rail is all set to become operational on September 24. Minister KT Rama Rao met Governor ESL Narasimhan at Raj Bhavan and invited him to flag off the Metro line.
Story first published: Wednesday, September 19, 2018, 19:47 [IST]