భవిష్యత్తులో శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తాం: కేటీఆర్
మెట్రో రైలు సౌకర్యాన్ని భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తామని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.
హైదరాబాద్: మెట్రో రైలు సౌకర్యాన్ని భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తామని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.
శనివారం హైదరాబాదులో కేటీఆర్ మాట్లాడుతూ రెండో దశ మెట్రో రైలు మార్గం విస్తరణలో భాగంగా మరో 80 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ఈ మధ్యే ప్రారంభమైన మెట్రో రైలు ప్రయాణానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని అన్నారు. ఇప్పటికే జరుగుతున్న మెట్రో పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ కార్యక్రమాన్ని చేపడతామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మెట్రో రైలులో జీహెచ్ఎంసీ ఉద్యోగులు ప్రయాణం చేసిన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు.
Glad Hyderabad Metro is being enjoyed by all sections of people
— KTR (@KTRTRS) December 2, 2017
GHMC workers have also enjoyed it today 😊 pic.twitter.com/GitFlDyaA1
Thanks Amit. Glad you liked it
— KTR (@KTRTRS) December 2, 2017
Yes, plans are to firstly complete the city coverage & then also to airport
Phase 2 for another 80 plus kilometres in the planning stages https://t.co/Ft2rbKgfDV