వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చి 15 నుండి ఒంటిపూట బడులు.. ఆదేశాలు జారీ

|
Google Oneindia TeluguNews

ఎండాకాలం వచ్చేసింది. ఈ సారి వేసవి తాపం, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది . రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన విద్యాశాఖ మర్చి 15 నుండి ఒంటిపూట బదులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణా రాష్ట్రం లోని అన్ని పాఠశాలల కు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను అమలు చేయాలని ఆర్జేడీలు, డీఈవోలను పాఠశాల విద్యా శాఖా డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ ఆదేశించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని పేర్కొన్నారు.

బతుకైనా చావైనా నీతోనే ... భర్త మరణించిన కొద్దిసేపటికే భార్య మృతిబతుకైనా చావైనా నీతోనే ... భర్త మరణించిన కొద్దిసేపటికే భార్య మృతి

Mid day school From March 15th .. Orders issued

మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే హైస్కూళ్లకు ఆప్షనల్‌ హాలిడేస్‌ అమలు చేయాలని పేర్కొన్నారు. ఒంటిపూట బడులను పాఠశాలలకు చివరి పనిదినం అయిన ఏప్రిల్‌ 12 వరకు కొనసాగించాలని, ఆ తరువాత నుండి వేసవి సెలవులని వివరించారు. దీంతో తిరిగి పాఠశాలలు జూన్‌ 1న ప్రారంభం కానున్నాయని తెలిపారు.

English summary
The education department has taken steps to organize the mid day schools in Telangana in view of the intensity of summer sunny days. This year also in the second week of March i.e march 15 th , the mid day schools will start functioning in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X