వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి ఎర్రబెల్లి కారు బోల్తా.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం, మండలం చిటూరు వద్ద అదుపు తప్పి పడిపోయింది. మంత్రి కారు వెనకాల వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారు డ్రైవర్ పార్ధసారది, సోషల్ మీడియా ఇంచార్జీ పూర్ణ మృతిచెందారు.

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అటెండర్ తాతారావు, గన్ మెన్ నరేష్, పీఏ శివను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

minister errabelli dayakar rao car roll over, two dead, 3 injured

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముందు కారులో ఉన్నారు. దీంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాన్వాయ్‌లోని కారు ప్రమాదానికి గురైన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది.

minister errabelli dayakar rao car roll over, two dead, 3 injured

శనివారం అర్ధరాత్రి ఆక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షతగాత్రుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

English summary
telangana minister errabelli dayakar rao convoy car roll over in ghanapur mandal chitur village. two persons dead, 3 injured. minister errabelli safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X