వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి జగదీష్ రెడ్డికి తప్పిన ప్రమాదం, కాన్వాయ్ వాహనం ఢీకొని 5 గురికి గాయాలు

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బటయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బటయపడ్డారు.

హైద్రాబాద్ నుండి కేతెపల్లిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం నాడు మంత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

Minister Jagadeesh Reddy safely escaped from road accident

మంత్రి కాన్వాయ్ లోని ఓ వాహనం అదుపుతప్పి ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.మంత్రికి వరుసకు సోదరుడయ్యే కరుణాకర్ రెడ్డి గాయపడ్డారు.

మంత్రి అటెండర్ లింగయ్య, భద్రతాధికారి అవినాష్ రెడ్డి, డ్రైవర్ కృష్ణ,గడ్డిపల్లికిచెందిన సత్యం గాయపడ్డారు. వీరందరిని సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.

Minister Jagadeesh Reddy safely escaped from road accident

మంత్రి హైద్రాబాద్ నుండి కేతెపల్లి వెళ్తుండగా కట్టంగూరు మండలంలోని ఎరసానిగూడెం వద్ద ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదం నుండి మంత్రి జగదీష్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు.

English summary
Minister Jagadeesh Reddy safely escaped from road accident in Kattumgur mandal.Five members injured in this accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X