చేనేతకు చేయూత: 50 శాతం సబ్సిడీపై పరిశ్రమలకు నూలు, కేంద్రానికి కేటీఆర్ లేఖ
చేనేత రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ విన్నవించారు. టెక్స్ టైల్ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీపై నూలు అందజేయాలని ఆయన కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. కరోనా వైరస్ వల్ల చేనేత రంగంపై ప్రభావం చూపుతోందని.. చేయూతనివ్వాలని కోరారు.
తెలంగాణలో కరోనా పంజా: ఒక్కరోజే 79 పాజిటివ్ కేసులు, 50 మంది డిశ్చార్జ్..
చేనేత, టెక్స్ టైల్ పరిశ్రమలకు 50 శాత సబ్సిడీపై నూలు అందజేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేనేతకు రెండేళ్లపాటు జీఎస్టీ నుంచి రాయితీ ఇవ్వాలన్నారు. నేనేత పరిశ్రమలో పనిచేస్తున్నవారికి ఆరు నెలలపాటు 50 శాతం వేతనం ఇవ్వాలని.. పరిశ్రమకు దీర్ఘకాలిక రుణాలను అందజేయాలన్నారు.
ఎక్కువమందికి ఉఫాది కల్పించే రంగంపై దృష్టిపెట్టడం వల్ల.. స్థూల జాతీయోత్పత్తి, ఎగుమతులను పెంచే అవకాశం ఉందన్నారు. వరంగల్, సిరిసిల్లాలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశామని వివరించారు. ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేవంతో చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు.