కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తోన్న తండ్రి, తల్లి ఏం చేసిందంటే
మూడు మాసాలుగా కన్నకూతురిపై అత్యాచారం చేస్తోన్న ఓ ఆటోడ్రైవర్ ను పోలీసులు శనివారం నాడు అరెస్టు చేసిన ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది. ఓల్డ్ మలక్ పేటలో ఉండే ఆటో డ్రైవర్ తన కూతురిపై మూడు మాసాలుగా అత్యాచా
హైదరాబాద్ :కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే స్వంత కూతురిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవ్వరీకి చెప్పకూడదని బెదిరించాడు. తీవ్రంగా కడుపునొప్పికి గురైన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. మూడు మాసాలుగా జరుగుతున్న ఈ తతంగం ఎట్టకేలకు వెలుగుచూసింది. కూతురిపై భర్త చేసిన దురాగతంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైద్రాబాద్ లోని ఓల్డ్ మలక్ పేట ప్రాంతంలో ఆటో డ్రైవర్ గా పనిచేసే ఓ వ్యక్తి తన కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆయన భార్య టైలర్ గా పనిచేస్తోంది. వీరికి ఓ కూతురు . వయస్సు 14 ఏళ్ళు. భార్య ఇంట్లో లేని సమయంలో తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బెదిరించి మూడు నెలలుగా కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు.
మైనర్ బాలిక, ఆమె తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. అయితే తానే ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి తండ్రే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అయినా ఆ బాలిక పరిస్థితిలో మార్పురాలేదు. కడుపునొప్పితో ఇబ్బందిపడుతుండేది.
భర్తపై అనుమానం వచ్చింది. ఆయన ప్రవర్తనలో కూడ మార్పులను ఆమె గమనించింది. దీంతో తల్లికి అనుమానం వచ్చి కూతురును ప్రశ్నించింది. ఈ ప్రశ్నలతో కూతురు అసలు విషయం బయటపెట్టింది. ఆమె వెంటనే చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని శనివారం నాడు అరెస్టు చేశారు.