అంకుల్! నేను మిస్టర్ ఫర్ఫెక్ట్-అమృతను మహారాణిలా..: ప్రణయ్ డైరీలో ఏముందంటే?
నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ రాసుకున్న డైరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమృతను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, ఆమెను బాగా చూసుకుంటున్నానని ప్రణయ్ తన డైరీలో రాసుకున్నట్లు తెలిసింది.
నాన్నను చంపేస్తా: ప్రణయ్ మృతదేహం చూసి భోరుమన్న అమృత, 'మారుతీరావు కబ్జాకోరు'
Recommended Video
అంకుల్.. నేను..
అంతేగాక, అమృత తండ్రిని ఉద్దేశించి కూడా ఆ డైరీలో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించినట్లు తెలిసింది. ‘అంకుల్ నేను మిస్టర్ ఫర్ఫెక్ట్.. మీరు మీ అమ్మాయికి తెచ్చే అబ్బాయిలో ఉండే ఫర్ఫెక్ట్ లక్షణాలు ఏవి ఉండాలని కోరుకుంటున్నారో.. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి' అని పేర్కొన్నట్లు సమాచారం.
అమృతను మహారాణిలా..
ప్రణయ్కి డైరీ రాసే అలవాటు ఉండటం వల్ల తాను అమృతను ప్రేమించిన విషయాలు రాసుకున్నట్లు తెలిసింది. కులం, ఆస్తిపాస్తులు చూసి ప్రేమికులను విడదీయరాదని, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికే అని ప్రణయ్ డైరీలో రాసుకున్నట్లు సమాచారం. మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానని ప్రణయ్ తన డైరీలో రాసుకున్నట్లు తెలిసింది.
నా బిడ్డను చంపరని లేదు.. అమృత
ఇది ఇలా ఉండగా, తనకు బిడ్డ పుట్టేలోగా తన భర్త ప్రణయ్ను హత్య చేసిన వారికి కఠిన శిక్షపడాలని అన్నారు అమృత. ‘ప్రణయ్ని చంపినవాళ్లు నా బిడ్డను చంపరని లేదు. బేబీ పుట్టే లోపు ప్రణయ్ని చంపినవాళ్లను ఉరితీస్తే బెటర్' అని అమృత వ్యాఖ్యానించారు.
పాఠశాల నుంచే ప్రేమ.. ఇలా చూస్తాననుకోలేదు..
‘మేము పాఠశాల నుంచి ప్రేమించుకున్నాం. మా విషయాలు ఇంట్లో వారందరికీ తెలుసు కానీ, మా డాడీ, బాబాయి ప్రణయ్ని బెదిరించారు. నన్ను ఎన్నో పర్యాయాలు కొట్టారు. నన్ను చంపి సాగర్లో వేస్తామని కూడా చెప్పారు. ప్రణయ్ని హత్య చేసిన సమయంలో ఉన్న సీసీ ఫుటేజీని ధైర్యం లేక ఇప్పటివరకు చూడలేదు. ఈరోజే సీసీ ఫుటేజీ చూశాను. ప్రణయ్ని కళ్లముందే చంపివెళ్లారు. అలా నేను చూస్తానని అనుకోలేదు. మా డాడీ లాంటి సైకోలు చాలా మంది ఉంటారు. 60ఏళ్లు ఉన్న వారికి కూడా భర్త చనిపోతే ఎంతో బాధ ఉంటుంది. కానీ, 21ఏళ్లు నాకు ఎంత బాధ ఉంటుంది?' అని అమృత కన్నీరుపెట్టుకున్నారు. తన బిడ్డను ప్రణయ్ ప్రతిరూపంగా చూసుకుంటానని చెప్పారు.