'కలెక్టర్ ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతుంది, కెసిఆర్కు వివరణ ఇస్తా'
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే దేవసేన మధ్య వివాదం ముదురుతోంది.
హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే దేవసేన మధ్య వివాదం ముదురుతోంది. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో అర ఎకరం భూమిని తాను కబ్జా చేశారని కలెక్టర్ దేవసేన చేసిన ప్రకటనను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రంగా ఖండించారు.
కలెక్టర్ దేవసేన చేసిన ప్రకటనను ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టారు. 'కలెక్టర్ ఏదో మనసులో పెట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన గజం భూమి కూడా నేను రిజిస్ట్రర్ చేసుకోలేదు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఏ శిక్షకైనా నేను సిద్ధమనని ప్రకటించారు..
ఈ భూమి విషయమై సీఎం కేసీఆర్ కు వివరణ ఇస్తానని ఆయన చెప్పారు.ఈ విషయంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని ఆయన ప్రకటించారు.తప్పు చేస్తే ప్రజలే శిక్షించి నన్ను ఇంటికి పంపిస్తారని ' ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అభిప్రాయపడ్డారు.