5 స్థానాలకు 6 నామినేషన్లు.. ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరం
హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఐదు స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఎన్నికలు తప్పేలా లేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి బరిలో నిలవగా, గులాబీ నేతల మద్దతుతో ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ పార్టీ తరపున గూడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీ బరిలోకి దిగారు. మెజార్టీ కారణంగా టీఆర్ఎస్ కు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఈజీగా దక్కుతాయి. అయితే ఐదో స్థానం కూడా దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు గులాబీ నేతలు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండటంతో.. క్రాస్ ఓటింగ్ ద్వారా ఆ అయిదో స్థానం కూడా కారు ఖాతాలో వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 12వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.