ఎప్పుడొస్తుంది?: బస్సు కోసం బస్టాండ్లో గంటన్నర నిలబడిన ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం శాసన సభ్యుడు సున్న రాజయ్య శనివారం నాడు నిజామాబాద్ జిల్లాలో బస్సు కోసం చాలాసేపు నిరీక్షించారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కడికైనా కార్లలో వెళ్తుంటారు!
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పొల్గొనేందుకు వచ్చారు. ఆన తిరుగు ప్రయాణం ఆర్టీసి బస్సులో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఆర్టీసీ అధికారులకు శనివారంమధ్యాహ్నం రెండు గంటలకు ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో సాయంత్రం ఐదు గంటలకు ఇంద్ర బస్సులో ఎమ్మెల్యే కోటాలో రిజర్వేషన్ కల్పించారు. ఐదు గంటలకు ఆయన బస్టాండుకు చేరుకున్నారు.
అయితే, గంటన్నరపాటు ఎమ్మెల్యే వేచి చూశాక.. అప్పుడు అంటే.. ఆరున్నర గంటలకు బస్సు వచ్చింది. అధికారులను ఆయన పలుమార్లు బస్సు ఎప్పుడు వస్తుందని అడిగారు. అనంతరం బస్సు పావు తక్కువ ఏడు గంటలకు బస్సు బయలుదేరింది.