గుడుంబాపై ఆబ్కారీ అధికారుల కొరడా: ఎమ్మెల్యే సోదరి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని ధూల్పేటలో జరిపిన దాడుల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోదరిని ఆబ్కారీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 20 నుంచి 26వ తేదీవరకు వారం రోజులుగా అక్కడ చేసిన దాడుల్లో మొత్తం 56కేసులు నమోదు చేసి, 37మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ధూల్పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.కనకదుర్గ తెలిపారు.
అరెస్టు చేసిన వారిలో గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ సోదరి కూడా ఉన్నట్లు ఆమె వివరించారు. జిల్లా డీసీ ఎం.ఎం.ఏ.ఫరూఖీ ఆదేశాల మేరకు ఆ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8.6కిలోల గంజాయి, 16.25లీటర్ల కల్తీ కల్లు, 1852 లీటర్ల గుడుంబాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా, 6.3లీటర్ల అక్రమ మద్యం, 11.05 లీటర్ల బీరు, 15150 లీటర్ల గుడుంబా ముడిసరుకు(వాష్), 345కిలోల నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ కనకదుర్గ వివరించారు.